Business Type9th Aug 09:56 AMSunil Byrisetty1 min read
బియ్యం ధరలకు రెక్కలు!
అనుకున్నంతా అయింది.. ఎల్ నినో ఎఫెక్ట్ తో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో సన్న రకం బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కిలోక
అనుకున్నంతా అయింది.. ఎల్ నినో ఎఫెక్ట్ తో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో సన్న రకం బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కిలోకు రూ.10-20 వరకు పెరిగాయి. టోకు మార్కెట్లో బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు ప్రియమయ్యాయి. అయితే ఎల్ నినో దెబ్బకు ముందే మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు పెంచేశారు. వారుఅక్రమంగా నిల్వలు పెంచడం, రవాణా ఖర్చులు పెరగడంతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. రేవుల్లో కంటైనర్లు పేరుకుపోయి బియ్యం మిల్లులు సంక్షోభంలో పడ్డాయి.