Agriculture12th Aug 04:43 PMSunil Byrisetty1 min read

వరికి బీమా గడువు 15 వరకే!

ఎల్ నినో పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కోసం ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ల

వరికి బీమా గడువు 15 వరకే!
ఎల్ నినో పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కోసం ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు రైతులు పంటల బీమాలో నమోదు చేసుకోవటానికి ఇదే చివరి అవకాశం. గడువు లోగా బీమా ప్రీమియం చెల్లిస్తే.. ఈ-పంట నమోదు వివరాలను తర్వాతైనా చేయించుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. ముందస్తు పంటల బీమాకు ఈ-పంట నమోదు అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం పంట సాగుపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించి, గడువులోగా బీమా ప్రీమియం చెల్లిస్తే చాలని పేర్కొంది.
Andhra Pradesh
Paddy Farmers
Crop Insurance
PM Fasal Bima Yojana
PMFBY
Crop Insurance Deadline
August 15
Kharif Season
Paddy Cultivation
Farmers
వ్యవసాయ శాఖ
ఎల్ నినో
పంట రక్షణ
బీమా ప్రీమియం
ఈ-పంట నమోదు
Scroll for the next article