TTD12th Aug 12:44 PMSunil Byrisetty1 min read
శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి విమానాశ్రయంలో ఈ - వీసా సేవలు అందుబాటులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం
శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి విమానాశ్రయంలో ఈ - వీసా సేవలు అందుబాటులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు విదేశీ భక్తులు తిరుపతి రావాలంటే చెన్నై లేదా బెంగళూర్ లేదా హైదరాబాద్ చేరుకొని అక్కడ ఈ - వీసా ప్రక్రియ పూర్తిచేసుకుని అటు నుంచి తిరుపతి చేరుకోవాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే ఈ - వీసా సేవలు అందుబాటులోకి వచ్చి.. విదేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయం చేరుకొని ఈ - వీసా ప్రక్రియ ముగించుకునే సదుపాయం కలుగుతుంది. తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ ముందస్తుగానే కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ - వీసా కౌంటరు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇంటర్నేషనల్ సర్వీస్ లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.