Spiritual23rd Aug 03:52 PMSunil Byrisetty1 min read
*ఆధ్యాత్మిక ప్రగతి దారులు..!*
ఏపిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు అవుతున్నాయి. 100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం కలగనుంది. రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడ
ఏపిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు అవుతున్నాయి. 100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం కలగనుంది. రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు నిర్మాణం అవుతున్నాయి. ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ రానుంది. వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు చేశారు.
శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.